శ్రీనువైట్ల ‘దూకుడు’ చిత్రంతో టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో చేరిపోయాడు.ఆ తర్వాత చేసిన ‘ఆగడు’, ‘బ్రూస్లీ’, ‘బాద్షా’, ‘మిస్టర్’ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
నాలుగు వరుస ఫ్లాప్ లు ఇచ్చిన ఏ దర్శకుడు కూడా మళ్లీ కోలుకోలేడు.కాని శ్రీనువైట్లకు మాత్రం అనుకోని అవకాశం అన్నట్లుగా రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కింది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటించింది.ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.
రవితేజ, శ్రీనువైట్ల ఇద్దరు కూడా ఫ్లాప్లలోనే ఉన్నారు.అయినా కూడా వీరి కాంబో మూవీకి మంచి క్రేజ్ దక్కింది.ఎందుకంటే ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు నిర్మించడం.ప్రస్తుతం సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న మైత్రి వారు ఈ చిత్రాన్ని నిర్మించిన కారణంగా అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ చిత్రంతో జాగ్రత్తగా శ్రీనువైట్ల హిట్ కొట్టుకోకుండా, లేని పోని ప్రయోగాలు చేస్తూ మంట కలిపేలా ఉన్నాడు.‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని చెబుతున్నారు.
ఇక ఇలియానా సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.
ఇలియానాను ఈ చిత్రంలో హీరోయిన్గా తీసుకోవడమే పెద్ద ప్రయోగం.
అలాంటిది మళ్లీ ఈ చిత్రంలో ఇలియానాతో డబ్బింగ్ చెప్పించాడు.తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇలియానా డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదు.
తాజాగా ఈ చిత్రంతో డబ్బింగ్ ముచ్చట తీర్చుకుంది.ఇలియానా పాత్రకు ఇలియానాతో డబ్బింగ్ చెప్పిస్తేనే బాగుంటుందని భావించాను.
అందుకే ఆమెతో చెప్పించాను.తెలుగు బాగా మాట్లాడగలిగే ఇలియానా సింగిల్ టేక్ లోనే డబ్బింగ్ చెప్పేసింది అంటూ శ్రీనువైట్ల సంకలు గుద్దుకుంటున్నాడు.
ఫలితం కాస్త అటు ఇటు అయితే అప్పుడు అయ్యగారికి తెలుస్తుంది.యూటర్న్ చిత్రంలో సమంత వాయిస్ మైనస్ అంటూ విమర్శలు వచ్చాయి.అలాగే ఇంకా పలువురు హీరోయిన్స్ కూడా డబ్బింగ్ ప్రయత్నించి విమర్శల పాలు అయ్యారు.మరి ఇలియానా పరిస్థితి ఏంటో చూడాలి.