భవనంపై నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం.. !

తాగిన మైకంలో ఓ వ్యక్తి భవనంపై నుంచి జారి పడి మృతి చెందాడు.అపార్ట్ మెంట్ పై నుంచి కింద పడిన ఆ వ్యక్తి కొనఊపిరితో ఉన్నాడు.

 Man Slips From Building And Dies Man, Suicide, Police ,srinivas Building, Wife,-TeluguStop.com

స్థానికుల సహాయంతో అతడి భార్య ఆస్పత్రికి తరలించగా.మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

నగరంలోని మోతీనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న బిజినెస్ మెన్ శ్రీనివాస్ (48) శుక్రవారం రాత్రి బిల్డింగ్ మూడో అంతస్తుపై నుంచి జారీ పడ్డాడు.మద్యం సేవించిన తను సిగరెట్ తాగడానికి వరండాలోకి వెళ్లాడు.

వర్షం కురవడంతో కాలు జారీ కిందకు పడ్డాడు.అది చూసి అతడి భార్య పిల్లలు కిందకు వచ్చే సరికి శ్రీనివాస్ కొన ఊపిరితో పోరాడుతున్నాడు.

స్థానికులు సాయంతో శ్రీనివాస్ ను సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించగా మార్గ మధ్యంలోనే మరణించాడని చెప్పడంతో కుటుంబం ఒక్కసారిగా శోకసంధ్రంలో మునిగించి.ఈ మేరకు సనత్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు.

కేసు దర్యాప్తులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube