టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చి తరువాత యాంకర్ గా టర్న్ తీసుకున్న అందాల భామ శ్రీముఖి.ప్రస్తుతం టెలివిజన్ పై తిరుగులేని యాంకర్ గా పలు రియాలిటీషోలు, ఈవెంట్స్ తో దూసుకుపోతున్న శ్రీముఖి అప్పుడప్పుడు తనలో నటిని బయటకి తీసుకొస్తూ యాక్టర్ గా సినిమాలు కూడా చేస్తుంది.
అయితే సినిమాల కంటే యాంకర్ గా ఆమెకి వస్తున్న క్రేజ్ ఎక్కువగా ఉంది.హాట్ యాంకర్స్ అనసూయ, రష్మి ఉన్న కూడా వారు కొన్నింటికే పరిమితం అవుతున్నారు.
అయితే శ్రీముఖి మాత్రం అన్ని టాప్ చానల్స్ లో కూడా యాంకర్ గా షోలు చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి ఏ మాత్రం ఫ్రీ టైం దొరికిన తనలోని టాలెంట్స్ ని బయటకి తీసుకొస్తూ ఉంటుంది.
ఈ మధ్య ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు తన మాటలతో సోషల్ మీడియాలో పోస్టులతో అందరికి స్వీట్ షాక్ ఇస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు తనలో మరో హిడెన్ టాలెంట్ ని ఈ అమ్మడు బయట పెట్టింది.
తాజాగా తనలోని టాలెంట్ ఫోటో తీసి శ్రీముఖి సోషల్ మీడియాలో పెట్టింది.శ్రీముఖికి డ్రాయింగ్ అంటే భాగా ఇష్టం అంట.ఆ విషయాన్నీ శివరాత్రి జాగారం సందర్బంగా మహాశివుడి చిత్రాన్ని పేపర్ పై గీసిన ప్రూవ్ చేసింది.ఆ పరమశివుడి చిత్రం ఫోన్ లో చూసి గీసినట్లు తెలిపింది.
ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.మొత్తానికి యాంకర్ గా తన మాటలతో అందరిని అలరించే శ్రీముఖి యాక్టర్ గా కూడా ఇప్పటికే మెప్పించింది.
ఇప్పుడు తనలో మరో కళని బయట పెట్టి అందరికి సరికొత్తగా సర్ప్రైజ్ ఇచ్చింది.శ్రీముఖి వేసిన శివుడు ఫోటో చూసిన ఎవరైనా మొత్తానికి ఈ అమ్మడు మహా గట్టిదే అని మాట్లాడుకుంటున్నారు.