బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా శ్రీముఖి ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.చాలామంది యాంకర్లు మొదట బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుని ఇక్కడ సక్సెస్ సాధిస్తే వెండితెర వైపు అడుగులు వేస్తున్నారు.
అయితే శ్రీముఖి మాత్రం వెండితెరపై సక్సెస్ సాధించి ఆ తరువాత బుల్లితెర వైపు అడుగులు వేశారు.అయితే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సిక్త్ సెన్స్ షోలో శ్రీముఖి హద్దులు దాటారు.
శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెడుతూ శ్రీముఖి రచ్చరచ్చ చేశారు.ఓంకార్ హోస్ట్ గా సిక్త్ సెన్స్ షో ఇప్పటికే మూడు సీజన్లు ప్రసారం కాగా ప్రస్తుతం నాలుగో సీజన్ ప్రసారమవుతోంది.
ఫస్ట్ ఎపిసోడ్ కు ఆది, అనసూయ్ గెస్ట్ లుగా హాజరు కాగా సెకండ్ ఎపిసోడ్ కు మాత్రం శ్రీముఖి, శేఖర్ మాస్టర్ గెస్ట్ లుగా హాజరయ్యారు.స్టా మా ఛానల్ లో ప్రసారమైన డ్యాన్సీ ప్లస్ షో ముగియడంతో ఆ షో స్థానంలో ఈ షో ప్రసారమవుతుండటం గమనార్హం.
శ్రీముఖి శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టగా మాస్టర్ కూడా ఆ ముద్దులను ఎంజాయ్ చేశారు.ఆ తరువాత శ్రీముఖి మీ ఆయన పేరేంటి అని శేఖర్ మాస్టర్ ను అడగగా శేఖర్ మాస్టర్ శిరీష అని చెబుతాడు.శ్రీముఖి శిరీష గారు ఇది కేవలం కల్పితం మాత్రమే సీజీలో ముద్దు పెట్టినట్టు చూపించారు అని చెప్పగా ఓంకార్ మాత్రం శ్రీముఖి ముద్దు పెట్టిందని చెబుతాడు.ఆ తరువాత సూపర్ హిట్టు పాటకు శ్రీముఖి, శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేశారు.
షోలో శ్రీముఖి ఓంకార్ ను బావా అంటూ రెచ్చిపోవడం గమనార్హం.తండ్రి అయినప్పుడు ఫీలింగ్ ఎలా ఉందని ఓంకార్ అడగగా తాను షూట్ లో ఉన్న సమయంలో కాల్ వచ్చిందని ఆడపిల్ల పుట్టిందని చెప్పగానే ఈ ప్రపంచంలో ఇంతకు మించి ఏమీ అవసరం లేదని అనిపించిందని ఆ సంతోషమే వేరని శేఖర్ మాస్టర్ అన్నారు.