నటిగా ఎంట్రీ ఇచ్చి తరువాత యాంకర్ గా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.ఓ వైపు రియాలిటీ షోలతో ఫుల్ బిజీ యాంకర్ గా ఉంటూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తుంది.
రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్తదనం ఉన్న కథలు మాత్రమే శ్రీముఖి ఒకే చెబుతుంది.ఇక ఆమె మెయిన్ లీడ్ లో ఇట్స్ టైం టూ పార్టీ అనే సినిమా తెరకెక్కింది.
సైబర్ క్రైమ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీముఖి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తుంది.క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
ఈ సినిమాతో గౌతమ్ ఈవీఎస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.
ఈ మధ్యకాలంలో అన్ని చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.థియేటర్లు ప్రస్తుతం ఓపెన్ అయినా ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం వలన, అలాగే ప్రేక్షకులు కూడా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే ఆసక్తి చూపించడం లేదు.
ఈ నేపధ్యంలో ఓటీటీ రిలీజ్ వైపు చిన్న సినిమాల నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.కొంత మంది పే ఫర్ వ్యూలో సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటే కొంత మంది డిజిటల్ రైట్స్ ని అమ్మేసుకుంటున్నారు.
ఇప్పుడు శ్రీముఖి ఇట్స్ టైం టూ పార్టీ మూవీ కూడా ఈ నెల 24న ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది.అయితే ఈ సినిమాని ఏకంగా నాలుగు ఓటీటీ ఛానల్స్ లో రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం.
ప్రముఖ ఓటీటీ సర్వీస్ ఎంఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్టెల్ ఎక్స్పో, అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమ్ కానుంది.