బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన విషయం తెల్సిందే.శ్రీముఖి చాలా టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా రాహుల్ను ఆయన అభిమానులు గెలుచుకున్నారు.
ఫైనల్ వారంలో అయిదుగురు మిగిలినా కూడా శ్రీముఖి మరియు రాహుల్ల పేర్లు ఎక్కువగా వినిపించాయి.వీరిద్దరికే ఎక్కువ ఛాన్స్ ఉందని, అలీకి అత్యల్పంగా ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి.
అలాగే జరిగింది.ఇక రాహుల్ మరియు శ్రీముఖిల మద్య ఓట్ల శాతం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
నాగార్జున చెప్పినదాని ప్రకారం మొత్తం 8.5 కోట్ల ఓట్లు నమోదు అయ్యాయి.అందులో 20 శాతం అలీ, వరుణ్, బాబా భాస్కర్లకు పడగా మిగిలిన 80 శాతం ఓట్లు కూడా శ్రీముఖి మరియు రాహుల్లకు పడ్డాయట.అయితే ఓటింగ్ మొదలైనప్పటి నుండి కొద్ది సమయం శ్రీముఖి ఉంటే మరి కొద్ది సమయం రాహుల్ లీడ్లో ఉంటూ వచ్చారట.
ఇలా మొత్తానికి చివరి రోజు ఓట్లు క్లోజ్ చేసే సమయానికి శ్రీముఖి కంటే కేవలం ఒక్క శాతం మాత్రమే రాహుల్ ఓట్లు లీడ్లో ఉన్నట్లుగా మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
స్టార్ మాటీవీలో ప్రసారం అయిన బిగ్బాస్ సీజన్ 3లో విన్నర్గా నిలిచిన రాహుల్పై శ్రీముఖి అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.ఆడవారి వల్ల గెలిచావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొదట పునర్నవితో పులిహోర వల్ల నీకు ఛాన్స్ దక్కింది.
ఆ తర్వాత శ్రీముఖితో గొడవ వల్ల నీకు ప్లస్ అయ్యింది.అంతకు మించి నీవు చేసింది ఏమీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ లెక్కన చూస్తే శ్రీముఖి విన్నర్ అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.