సినిమాలు, టీవీ షోలు చేయడం ద్వారా మంచి పేరును తెచ్చుకోవడంతో పాటు శ్రీముఖి భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.శ్రీముఖి చేసిన షోలలో ఎక్కువ షోలు సక్సెస్ సాధించాయి.
అయితే ఈ మధ్య కాలంలో టీవీ షోలకు దూరంగా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు.సోషల్ మీడియాలో పలు ఉత్పత్తులను శ్రీముఖి ప్రమోట్ చేస్తుండటం గమనార్హం.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను శ్రీముఖి బాగా ఫాలో అవుతున్నారు.ఆదాయాన్ని పెంచుకునే ప్రతి మార్గాన్ని శ్రీముఖి వదులుకోకుండా డబ్బులను సంపాదిస్తున్నారు.చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ అనే తేడాలు లేకుండా ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు.శ్రీముఖి రిసార్ట్స్ , హోటల్స్ లో తన వెకేషన్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటం గమనార్హం.
తాజాగా శ్రీముఖి జియో మార్ట్ ను ప్రమోట్ చేశారు.కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేకపోవడంతో ఈవెంట్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది.అయితే శ్రీముఖి మాత్రం తెలివిగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.మరోవైపు శ్రీముఖి నటించిన కొన్ని సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.శ్రీముఖి బుల్లితెర ఆఫర్లతో బిజీ అవుతారో లేక వెండితెర ఆఫర్లతో బిజీ అవుతారో చూడాల్సి ఉంది.
పటాస్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం ద్వారా ఆ పాపులారిటీని మరింత పెంచుకున్నారు.మరోవైపు శ్రీముఖికి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తరచుగా ఎదురవుతున్న నేపథ్యంలో తన పెళ్లికి ఇంకా సమయం ఉందని శ్రీముఖి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.శ్రీముఖి పెళ్లి కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తుండగా ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలని శ్రీముఖి భావిస్తున్నారు.