కరోనా విపత్తు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను భయాందోళకు గురి చేస్తున్న విషయం తెల్సిందే.ఈ సమయంలో కొన్ని చిన్న దేశాలు చిగురుటాకు మాదిరిగా వణికి పోతున్నాయి.
కొన్ని దేశాలు బిజినెస్ చేసుకుంటూ ఉంటే మన దేశం మాత్రం దాతృత్వంను చాటుకుంటుంది.దాదాపు 10 దేశాలకు ఈ పరిస్థితుల్లో అత్యవసరం అయిన ఔషదాలను ఇంకా కరోనా నిర్ధారణ కిట్లను అందించేందుకు ఇండియన్ ప్రభుత్వం సిద్దం అయ్యింది.
తాజాగా శ్రీలంకకు భారత ప్రభుత్వం నుండి విమానం వెళ్లింది.అందులో పెద్ద ఎత్తున ఔషదాలు ఇంకా కరోనా నిర్ధారణ టెస్టు కిట్స్ ఉన్నాయి.భారత ప్రభుత్వం ఇంకా ప్రజల నుండి శ్రీలంక ప్రభుత్వం ఇంకా ప్రజలకు బహుమానం అంటూ ఆ కాటన్స్పై రాసి ఉంది.ఈ ఫొటోలను శ్రీలంక అధ్యక్షుడు రాజపక్క ట్వీట్ చేశారు.
భారత్ చేసిన సాయంకు ఆయన కృతజ్ఞతలు చెప్పాడు.ఈ సమయంలో భారత్ చేస్తున్న సాయంను ప్రపంచ దేశాలు అభినందిస్తూ ఇండియాకు సెల్యూట్ చేస్తున్నాయి.