శుక్రవారం సాయంత్రం హీరో సాయి ధరమ్ తేజ్ కి జరిగిన రోడ్డు ప్రమాదం పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఈ ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.ఈ విధంగా ప్రతి ఒక్కరూ తను క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటున్న సమయంలో సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా నటుడు నరేష్ మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్, తన కొడుకు నవీన్ చిన్నప్పటినుంచి ఎంతో మంచి స్నేహితులని, వీరిద్దరు ప్రతిరోజు కలుస్తూనే ఉంటారని, ఈ ప్రమాదం జరగడానికి ముందు కూడా సాయి ధరమ్ తేజ్ తన ఇంటికి వచ్చారని తెలిపారు.
వీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లాలని భావించినప్పుడే వద్దని చెబుదామనుకున్నాను.
కానీ అంతలోపే వీరు బయలుదేరి వెళ్లారని, ఇలా వెళ్ళిన కొంత సమయానికి సాయిధరమ్ తేజ ప్రమాదానికి గురయ్యాడన్న వార్తను విన్నానని నరేష్ తెలిపారు.నిత్యం తన కొడుకు నవీన్ సాయి ధరమ్ ఇద్దరు కలిసి బైక్ రేసింగ్ కు వెళ్తారని నరేష్ చెప్పడంతో పలువురు నరేష్ వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇప్పటికే నరేష్ చేసిన వ్యాఖ్యలపై బండ్లగణేష్ స్పందిస్తూ నిజానిజాలు తెలుసుకోకుండా ఈ విధమైనటువంటి సమయాలలో రాజకీయాలు చేయడం సరైనది కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు.
ఈ క్రమంలోనే నరేష్ వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ.ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో నరేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం బాలేదని.సాయి ధరమ్ తేజ్ కేవలం రోడ్డుపై బురద ఉన్న కారణంగా స్కిడ్ అయ్యి కింద పడ్డారని, నరేశ్ పెట్టిన వీడియో బైట్ నాకెందుకో ఇబ్బందిగా అనిపించిందని నటుడు శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఇప్పటికే తనకు ప్రమాదం జరిగిందని తన కుటుంబ సభ్యులందరూ ఎంతో కంగారుగా ఉంటారు.ఇలాంటి సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి పేర్లను బయటకు తీస్తూ మాట్లాడటం ఏమాత్రం బాగలేదని దయచేసి ఎవరూ కూడా ఇలా చనిపోయిన వారి పేర్లను బయటకు తీసుకు రావద్దు అంటే శ్రీకాంత్ నరేష్ వ్యాఖ్యలపై స్పందించారు.