టాలీవుడ్ లో నెగిటివ్ పాత్రలలో నటుడుగా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా టర్న్ తీసుకొని ఫామిలీ ప్రేక్షకులకి బాగా రీచ్ అయిన హీరోగా నిలిచాడు.శోభన్ బాబు, జగపతి బాబు తర్వాత శ్రీకాంత్ ఫామిలీ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు.
ఇదిలా ఫామిలీ చిత్రాలతో పాటు అప్పుడప్పుడు డిఫరెంట్ కంటెంట్ తో మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించే సినిమాలు శ్రీకాంత్ చేశాడు.అయితే ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న ఒకప్పుడు ఉన్నంత మార్కెట్ అతని సినిమాలకి లేదు.
ఏదో హిట్ అనే టాక్ వస్తే తప్ప శ్రీకాంత్ సినిమాలు థియేటర్ లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు.దీంతో అతను కూడా కెరియర్ పరంగా టర్న్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీకాంత్ చేశాడు.అలాగే నెగిటివ్ రోల్స్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు.
యుద్ధం శరణం సినిమాలో చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీకాంత్ కనిపించాడు.
ఇదిలా ఉంటే ఇతర బాషలలో కూడా శ్రీకాంత్ క్యారెక్ట ఆర్టిస్ట్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించాడు.మరోవైపు తన మాతృభాష కన్నడంలో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇప్పటికే కన్నడంలో మూడు సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొత్త సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ డ్రామా జేమ్స్.
చేతన్ కుమార్ ఈ చిత్రానికి దర్కత్వం వహించనున్నాడు. కిశోర్ పత్తికొండ ఈ మూవీని నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించబోతున్నాడు.అయితే శ్రీకాంత్ చేస్తుంది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే కాదా అనేది చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.