ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరుగా రాయలసీమ ఉండేది.కాగా గత కొన్ని సంవత్సరాల నుండి ఫ్యాక్షన్ గొడవలు తగ్గాయనుకుంటే రాజకీయ హత్యలు మొదలైయ్యాయి.
ఈ క్రమంలో చంపుకోవడాలు, బాంబులు పెట్టే సంప్రదాయలకు కొందరు శ్రీకారం చుడుతున్నారట.ప్రశాంతంగా ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు గొడవలతో ఉలిక్కి పడేలా చేయడం ప్రస్తుతం సర్వసాధారణం అయ్యింది.
ఇకపోతే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబుల కలకలం చెలరేగింది.ఇక ఇక్కడి పోలీసులు ఏవోబీ గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా, గొల్ల కంచిలి లోని ఓ ఇంట్లో బాంబులు, కర్రలు, గాజు పెంకులు నిల్వ ఉంచినట్లు గుర్తించిన పోలీసులు భారీగా నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఇచ్చాపురం నియోజకవర్గంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకే ఈ బాంబులు సిద్ధం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.ఇక ఈ ఘటనకు సంబంధిచిన సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు గొల్ల కంచికి చేరుకున్నారట.