మిస్ యూనివర్స్ సింగపూర్ -2021గా తెలుగమ్మాయి నందిత బన్న ఎంపికయ్యారు.శుక్రవారం అర్ధరాత్రి నిర్వాహకులు ఈ ఫలితాలను వెల్లడించారు.
నేషనల్ మ్యూజియం సింగపూర్లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి.ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్ను దక్కించుకున్నారు.
దాదాపు ఆరునెలలుగా వివిధ అంశాల్లో జరిగిన పోటీల తర్వాత ఏడుగురిని తుది దశకు ఎంపిక చేశారు.అందులో నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలిచ్చిన నందితకు టైటిల్ దక్కింది.
మరోవైపు మిస్ యూనివర్స్ సింగపూర్గా కిరీటాన్ని దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు నందిత.డిసెంబర్లో ఇజ్రాయిల్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలలో సింగపూర్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 గా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నందిత ప్రస్తుతం సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో డిగ్రీ ఫైనలియర్ చేస్తున్నారు.
కాగా, నందిత స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారు దూదివారి వీధి.
ఇక్కడే వీరి కుటుంబానికి సొంతిల్లు ఉంది.తండ్రి బాన్న గోవర్ధనరావు, తల్లి ఫణి మాధురి.
వీరి కుటుంబం 25 ఏళ్ల కిందట సింగపూర్కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.గోవర్ధన్, ఫణిమాధురిలు ఇద్దరూ సివిల్ ఇంజినీర్లే కావడం విశేషం.
ప్రస్తుతం గోవర్ధనరావు ఏవియేషన్ సప్లయ్ చెయిన్ సీనియర్ మేనేజర్గా పని చేస్తున్నారు.నందిత సోదరుడు హర్ష సౌరవ్ కెనడాలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు.
ఇక శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా చేసి రిటైరైన డాక్టర్ బాన్న సంజీవరావు నందితకు చిన తాత.ప్రముఖ డెంటిస్ట్ బాన్న త్రినాథరావు ఆమెకు పెదనాన్న.