ఏపీలో పొలిటికల్
వార్ ఏ స్దాయిలో ఉందో అందరికి తెలిసిందే.నేతలు ఉన్నది ప్రజల కోసం కాదు.
రాజకీయ విమర్శలు చేసుకోవడం కోసం అనే విషయం ఏపీలోని కొందరు నాయకులను చూస్తుంటే అర్ధం అవుతుంది.
ఇకపోతే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య పెంబర్తిలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
ఇందులో వైసీపీ నేత, గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై దాడి జరిగింది.అదీగాక ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా ఆటంకం ఏర్పడింది.
కాగా పరిషత్ పోలింగ్ రోజు పొందూరు మండలం పెనుబర్తిలో జరిగిన ఈ ఘటనలపై డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ మాజీ విప్ కూన రవికుమార్ ను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా, ఆయన కనిపించలేదట.
ఇలా మరోసారి కూడా పోలీసులకు చిక్కకుండా కూన రవికుమార్ అదృశ్యం అయ్యారట.
ఇకపోతే ఈ కేసులో మొత్తం కూన రవితో సహా మొత్తం 60 మందిపై కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.