అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి సక్సెస్ అయ్యింది.ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.
తల్లికి తగ్గ వారసురాలిని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది.ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది అమ్మ, అక్కలాగే తాను కూడా మంచి నటిని అనిపించుకోవాలని అనుకుంటుంది.
అయితే ఖుషీ కపూర్ తన తెరంగేట్రానికి బాలీవుడ్ ని కాకుండా టాలీవుడ్ ని వేదికగా చేసుకుంటుందని తెలుస్తుంది.టాలీవుడ్ లో తన తల్లికి ఉన్న పాపులారిటీతో తనకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని అనుకుంటుంది.
ఇక తల్లిని మరిపించే రీతిలో టాలీవుడ్ లో అలాగే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అనుకుంటుంది.
ఇదిలా ఉంటే ఆమె ఎంట్రీకి ఇప్పుడు రంగం సిద్ధమైందని తెలుస్తుంది.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కబోతున్న పెళ్ళిసందడి సినిమాలో ఖుషీ కపూర్ ని ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు మాళవికా నాయర్ ని అనుకున్నారు.
అయితే ఆమె రోషన్ కంటే వయసులో పెద్ద కావడం, ఆమె లుక్ కూడా డామినేట్ గా కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు వేరొక హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.ఈ నేపధ్యంలో బోనీ కపూర్ రిఫరెన్స్ తో ఖుషీ కపూర్ కి ఆ అవకాశం వచ్చిందని చెప్పుకుంటున్నారు.
అయితే ఇది అఫీషియల్ గా ఫైనల్ అయ్యి క్లారిటీ వచ్చే వరకు సస్పెన్స్ గానే ఉంటుంది.