ఈ కరోనా కాలంలో.అందరూ ఇంటి వద్దే ఉండాలన్న ప్రభుత్వ నిబంధనతో.
సామాన్య ప్రజలు తమ పనులకు విరామం చెప్పి.ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
సినిమా థియేటర్ లు కూడా మూత పడడంతో ప్రేక్షకులకు ఏమీ తోచకుండా పోతోంది.దీన్ని ఆసరాగా చేసుకున్న బుల్లితెర నిర్వాహకులు.
వారిని తమ వైపు మళ్ళించుకునేదుకు శత విధాల ప్రయత్నిస్తున్నాయి.అందులో భాగంగానే వీక్షకులకి మరింత ఉత్సహాన్ని కలిగించేందుకు.
వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.
ఈ మధ్య కాలంలో ప్రారంభమైన శ్రీదేవి డ్రామా కంపెనీషో మరిన్ని సోబగులను అద్దుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.న్యాయ నిర్ణేతగా నటి ఇంద్రజ ఉన్నారు.మరియు ఇతర జబర్దస్త్ కమెడియన్స్ ఈ షోలో తమ తమ రోల్ ను ప్లే చేస్తున్నారు.
ప్రతీ ఎపిసోడ్ లోనూ ఒక థీమ్ ని ఆధారంగా చేసుకొని మొత్తం ఈవెంట్ ను నడిపిస్తారు.
ఈ మధ్య జరిగిన ఫ్రెండ్షిప్ డే, ఆచార్య దేవోభవలాంటి స్పెషల్ డే ఈవెంట్స్ ని విజయవంతంగా జరిపి టీవీ అభిమానుల్ని నవ్వుల్లో ముంచెత్తుతారు.అందులో భాగంగానే.కవలల థీమ్ ని బేస్ చేసుకొని ఈ వారం ఎపిసోడ్ ని డిజైన్ చేశారు.
దీనికి సంంధించిన ప్రోమో ఒకటి రిలీజైంది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన కవలలు .తమ తమ టాలెంట్ తో అందర్నీ నవ్విస్తూ.ఆటపాటలతో కనువిందు చేస్తారు.మరి కొందరు తమ భావోద్వేగ సన్నివేశాలతో కంటతడి పెట్టిస్తారని అర్థమవుతుంది.
ఇక తన మాటల తూటాలతో పంచులు వేస్తూ.జబర్దస్త్ లో మంచి కామెడియన్ గా పేరుగాంచిన హైపర్ ఆది ఈ షో లోనూ తానేంటో మరోసారి నిరూపించు కునేందుకు తాపత్రయ పడ్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ ప్రోగ్రామ్ లో ఒక స్కిట్ లో భాగంగా ఒకే రూపంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళతో మాట్లాడుతూ.వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొని ఐదు సంవత్సరాలైంది.
ఇప్పటికీ వీళ్లలో మరదలు ఎవరో, పెళ్ళాం ఎవరో తెలియడం లేదంటూ ఇద్దరి నడుముపై గిల్లుతాడు.అప్పుడు వాళ్ళు సిగ్గు పడే విధానాన్ని బట్టి ఎవరు మరదలు, ఎవరు భార్య అనేది కనిపెట్టే సన్నివేశాన్న .అత్యంత హాస్యాస్పదంగా తీర్చి దిద్దారు.అలాగే ఒకే రూపంలో ఉన్న బావమరుదులతో మాట్లాడుతూ.
బాగా సంపాదించి మణికొండలో ఉండాల్సిన నేను రెండు మణికొండ మధ్యలో ఉండాల్సి వస్తోంది అంటూ తనదైన స్టైల్లో పంచ్ వేస్తాడు.అది చూసి ఇంద్రజ పగలబడి నవ్వుతుంది.
ఇక మిగతా ఎపిసోడ్ ఎలా జరిగిందో చూడాలని ఉన్న అభిమానులు.ప్రస్తుతానికి ఈ ప్రమోతో సరిపెట్టుకోవాల్సిందే…
.