అందాల తార దివంగత నటి శ్రీదేవి కూతురుగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్ సినిమాలు చేసింది తక్కువ అయినా ప్రచారం భారీ స్థాయిలో జరిగింది.శ్రీదేవి కూతురు కావడంతో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
అయితే ఫాలోయింగ్ ఎలా పెరిగిందో యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే పెరిగారు.
ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా నటించిన బాలీవుడు సినిమా గుంజన్ సక్సేనా ఈ నెల 12 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది.
కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ గా ఈ సినిమాను రూపొందించారు.ఈ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమాలో అంత విషయం లేదంటూ రివ్యూలు, కెమెంట్లు చేశారు.అసలు అటువంటి పాత్ర పోషించే స్ట్రచర్ కానీ, మెచ్యూరిటీ కానీ జాన్విలో అసలు లేవని విమర్శలు చేశారు.ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.దీంతో జాన్వీ బాగా అప్సెట్ అయ్యిందట.
గుంజన్ సక్సేనా సినిమాపై వచ్చిన ప్రతి రివ్యూనీ, ప్రతి ట్రోల్ నీ ఆమె చూసినట్టు, ఆ ట్రోలింగ్ ఆమెను చాలా బాధ పెట్టినట్టు ఆమె తెలిపింది.తన సినిమాకు వచ్చిన వ్యతిరేకతను ఆమె తండ్రి కూడా చూసి బాగా ఫీల్ అయినట్టు.
అయినా అతనికి ఆమెపై నమ్మకం ఉండడం వల్ల పట్టించుకోలేదని జాన్వీ తెలిపింది.