శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ మరియు సునైన లు హీరోయిన్స్ గా నటించిన రాజ రాజ చోర సినిమా చిత్రీకరణ పూర్తి అయిన చాలా రోజుల తర్వాత కరోనా వల్ల ఇబ్బందుల మద్య విడుదల అయ్యింది.సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత బిగ్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు విభిన్నమైన కామెడీతో అందరిని అలరించిన రాజ రాజ చోర సినిమా మరో లెవల్ ఎంటర్ టైన్మెంట్ ను అందించింది అంటూ అంతా కూడ అభినందించారు.
థియేటర్ లలో ఈ సినిమా ఇంకా బాగానే ఆడుతోంది.ఈ సమయంలోనే చాలా మంది ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
మాకు ఓటీటీ లో ఈ సినిమా కావాలి.థియేటర్ కు వెళ్లి చూసే పరిస్థితి లేదు అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఈమద్య కాలంలో విడుదల అయిన సినిమాలు అన్ని కూడా వారం లేదా రెండు వారాల్లోనే ఓటీటీ లో వచ్చేస్తున్నాయి.కనుక ఈ సినిమా కూడా తప్పకుండా వెంటనే ఓటీటీ లో వస్తుందని అంతా ఆశించారు.కాని అనూహ్యంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు కనీసం మూడు నుండి నాలుగు వారాల సమయం పడుతుందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను సెకండ్ వేవ్ తర్వాత దక్కించుకున్న రాజ రాజ చోర సినిమా ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసింది.
కనుక సినిమా ను వారు స్ట్రీమింగ్ చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు.తెలుగు లో వచ్చిన మొదటి భారీ కమర్షియల్ సక్సెస్ మూవీ కనుక ఖచ్చితంగా రాజ రాజ చోర సినిమా మరో లెవల్ లో ఉంటుంది అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.