యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే దిశగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.రెగ్యులర్ పేట్రన్ సినిమాలు చేయకుండా కొత్తదనం ఉన్న కథలు చేసుకుంటూ లోబడ్జెట్ లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా శ్రీవిష్ణుకి బ్రాండ్ ఉంది.
కొత్త దర్శకులు టాలీవుడ్ లో ముందుగా తమని తాము ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మొదటి ప్రయత్నం శ్రీవిష్ణుతోనే చేస్తూ ఉండటం విశేషం.అతని ద్వారా ఇప్పటికే చాలా మంది దర్శకులు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.
రొటీన్ కి బిన్నంగా సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు ప్రస్తుతం గాలి సంపత్ అనే క్రైమ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు.ఈ సినిమా ద్వారా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ కంప్లీట్ అయ్యింది.
ఇదిలా ఉంటే శ్రీవిష్ణు నుంచి తాజాగా మరో కొత్త సినిమా అప్డేట్ వచ్చింది.
జోహార్ వెబ్ ఫిలిం దర్శకుడు తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి అర్జున పాల్గుణ అనే టైటిల్ పెట్టారు.ఈ టైటిల్ పోస్టర్ ని ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
హీరో, హీరోయిన్లలతో పాటు మరో ముగ్గురు ఫ్రెండ్ పరుగు పెడుతున్నట్లు ఉండగా వారి ప్రతిబింబాలు నీటిలో కనిపించే విధంగా పోస్టర్ డిజైన్ చేశారు.అర్జున పాల్గుణ అనే మాటకి పల్లెటూరిలో మంచి పాపులారిటీ ఉంది.
అలాంటి పేరు ఉపయోగించుకొని శ్రీవిష్ణు ఏ జోనర్ లో సినిమా చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు బోగట్టా.