”పోరాడితే పోయేదేమి లేదు.బానిస సంకెళ్ళు తప్ప…” అన్న శ్రీశ్రీ మాటలు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
ఇప్పుడు ఈ వాక్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా.గత కొద్దీ రోజులుగా బెజవాడ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని తెలుగుదేశం పార్టీ పై అసంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల ఆయన లోక్ సభ లో విప్ పోస్ట్ ఇచ్చినా కూడా నేను ఆ పదవికి అర్హుడను కాను, పార్టీ లో అర్హులు అయిన వారికి ఆ పదవి ఇవ్వాలి అంటూ సున్నితంగా తిరస్కరించారు.అయితే ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా నానికి ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
అయితే బుధవారం బాబు తో ఫోన్ లో మాట్లాడిన నాని తెల్లారే అంటే గురువారం ఆయన శ్రీశ్రీ వాక్యాలను పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.దీనితో ఇప్పుడు కేశినేని పోరాటం ఎవరిపైనా.? టీడీపీ నాయకత్వంపైనా? కృష్ణా జిల్లా నేతలపైనా? అనే ఎవరి పైన ఉండనుంది అని అందరూ చర్చించుకుంటున్నారు.మరోవైపు ఆయన పార్టీ మారతారనే వార్తలు కుడా వెలువడుతున్నాయి.
అందుకే ఆ పార్టీ పై నిష్టూరంగా మాట్లాడుతున్నారు అని,విప్ పోస్ట్ ని వద్దనుకున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.అయితే ఈ వార్తల పై క్లారిటీ లేదు కానీ టీడీపీలో జరుగుతోన్న పరిణామాలపై మాత్రం నాని సంతృప్తిగా లేరన్న విషయం ఈ ఒక్క పోస్టింగ్ తో స్ఫష్టంగా అర్ధం అవుతుంది
.