క్రైమ్ కామెడీతో మూడో సినిమా చేస్తున్న కీరవాణి కొడుకు

మత్తు వదలరా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన నటుడు శ్రీసింహ.క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఆ సినిమా సింహకి సక్సెస్ ఇచ్చింది.

 Sri Simha's Third Film Titled Bhaag Saale, Tollywood, South Cinema, Keeravani So-TeluguStop.com

ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెల్లారితే గురువారం అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

పెళ్లి నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాకి శ్రీసింహ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

భాగ్ సాలె టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.తాజాగా ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

సురేష్ బాబు సమర్పణలో మధుర శ్రీధర్, యష్ రంగినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ద్వారా ప్రనీత్ బ్రహ్మండపల్లి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా సినిమా ఎనౌన్స్ సందర్భంగా రిలీజ్ చేశారు.మొదటి సినిమాని క్రైమ్ కామెడీతో హిట్ కొట్టిన శ్రీసింహ మూడో సినిమాని కూడా అదే జోనర్ లో చేయడం ద్వారా అతను ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నాడో అర్ధమవుతుంది.

ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారింది.ఓ వైపు కమర్షియల్ సినిమాలని ఆదరిస్తూనే కంటెంట్ బేస్ వచ్చే కథలని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో వస్తున్న మత్తు వదలరా, హిట్ లాంటి మూవీస్ సక్సెస్ అయ్యాయి.అలాగే డిజిటల్ చానల్స్ లో కూడా ఎక్కువగా కంటెంట్ బేస్ కథలు చూడటానికి ఇష్టపడుతున్నారు.

ఈ నేపధ్యంలో కీరవాణి తనయుడు కూడా కంటెంట్ బేస్ కథలతో తనని తాను నటుడుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube