మత్తు వదలరా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన నటుడు శ్రీసింహ.క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఆ సినిమా సింహకి సక్సెస్ ఇచ్చింది.
ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెల్లారితే గురువారం అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
పెళ్లి నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాకి శ్రీసింహ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
భాగ్ సాలె టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.తాజాగా ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
సురేష్ బాబు సమర్పణలో మధుర శ్రీధర్, యష్ రంగినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ద్వారా ప్రనీత్ బ్రహ్మండపల్లి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా సినిమా ఎనౌన్స్ సందర్భంగా రిలీజ్ చేశారు.మొదటి సినిమాని క్రైమ్ కామెడీతో హిట్ కొట్టిన శ్రీసింహ మూడో సినిమాని కూడా అదే జోనర్ లో చేయడం ద్వారా అతను ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నాడో అర్ధమవుతుంది.
ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారింది.ఓ వైపు కమర్షియల్ సినిమాలని ఆదరిస్తూనే కంటెంట్ బేస్ వచ్చే కథలని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో వస్తున్న మత్తు వదలరా, హిట్ లాంటి మూవీస్ సక్సెస్ అయ్యాయి.అలాగే డిజిటల్ చానల్స్ లో కూడా ఎక్కువగా కంటెంట్ బేస్ కథలు చూడటానికి ఇష్టపడుతున్నారు.
ఈ నేపధ్యంలో కీరవాణి తనయుడు కూడా కంటెంట్ బేస్ కథలతో తనని తాను నటుడుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం.