మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాటిది శ్రీసింహా.ఇతను కీరవాణి తనయుడు అనే విషయం అందరికి తెలిసిందే.
ఇదే సినిమాతో కీరవాణి మరో తనయుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.తరువాత అన్నాదమ్ముల కలయికలో ఆకాశవాణి అనే సినిమా ఎనౌన్స్ అయ్యింది.
అయితే ఆ సినిమా ఎంత వరకు పూర్తయ్యిందో ఇంకా తెలియరాలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది.తెల్లారితే గురువారం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కినది.
ఫస్ట్ లుక్ లో హీరో పెళ్లి కొడుకు గెటప్ లో కుర్చీలో దిగాలుగా కూర్చొని ఉన్నాడు.దీనిని బట్టి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
శ్రీసింహా సరసన నాయికలుగా చిత్రా శుక్లా, మిషా నారంగ్ నటిస్తున్నారు.ఈ చిత్రంతో మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ నెలాఖరుకి షూటింగ్ కంప్లీట్ చేసుకొని మార్చిలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి కాలభైరవ అందించిన మ్యూజిక్ ప్లస్ కాబోతుందని టాక్ నడుస్తుంది.
ఇక ఈ మధ్యకాలంలో మంచి ప్రామిసింగ్ మ్యూజిక్ తో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న సినిమాలు చేస్తుకుంటూ వస్తున్నాడు.