తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులపై ఆ మధ్యకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఒక్కసారిగా పాపులర్ అయిన నటి శ్రీరెడ్డి.అప్పట్లో ఈ భామకి తెలుగు మీడియా భారీగా హైప్ ఇచ్చింది.
అయితే తరువాత ఈ భామ పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఆమె వెనుక నిలబడ్డ అందరూ పక్కన పెట్టేసారు.మీడియా కూడా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.
దీంతో చెన్నై వెళ్లి అక్కడ కొంత కాలం హడావిడి చేసిన ఈ భామని తమిళ మీడియా సైతం కొంత కాలం దూరం పెట్టింది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ స్ట్రోక్ ఈ భామకి గట్టిగా తాకడంతో అప్పటి నుంచి అతనిని, జనసేన పార్టీని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తూ వస్తుంది.
అవకాశం దొరికినప్పుడు తన పేస్ బుక్ ద్వారా లైవ్ వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ మీద దారుణ వాఖ్యలు చేస్తూ ఉంటుంది.అదే పనిగా పవన్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
తాజాగా ఎన్నికలు నేపధ్యంలో ఈమె మరింతగా తన మాటల దాడి పెంచి అదే పనిగా విమర్శలు చేస్తూ వస్తుంది.దీంతో సోషల్ మీడియాలో ఆమెని టార్గెట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కారణంగా తనకి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చింది.పవన్ అందరూ అనుకున్నంత ఉత్తముడు కాదని, ఎన్నికలలో ప్రజలని మోసం చేయడానికి మంచితనం అనే ముసుగు వేసుకున్నాడని, అతని గురించి వాస్తవాలు బయటపెడుతున్న అనే కక్షతో పవన్ ఫ్యాన్స్ అదే పనిగా రోజు ఫోన్స్ చేసి బెదిరింపులకి పాల్పడుతున్నారని, చంపేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారని చెప్పుకొచ్చింది.తనకి ఏమైనా జరిగితే దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడు అవుతాడని కూడా మీడియాతో శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.మరి ఈమె విమర్శలపై పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతాడో అనేది చూడాలి.