జీ తెలుగు ఛానల్ లో ఈ నెల 4వ తేదీన శ్రీముఖి యాంకర్ గా నాగబాబు, జానీ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరించిన బొమ్మ అదిరింది ప్రోగ్రామ్ తొలి ఎపిసోడ్ లోని ఒక స్కిట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.ఈ స్కిట్ ఏపీ సీఎం జగన్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కించపరిచే విధంగా ఉండటంతో జగన్ అభిమానులు నాగబాబు, శ్రీముఖి, జానీ మాస్టర్ లను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
గతంలో ఇదే ఛానల్ లో అదిరింది షో ప్రసారం కాగా ఆ షోకు చిన్నచిన్న మార్పులు చేసి అక్టోబర్ 4 నుంచి బొమ్మ అదిరింది ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు.అయితే ఈ వివాదం గురించి సెలబ్రిటీలు ఎవరూ స్పందించకపోయినా శ్రీరెడ్డి ఈ వివాదంలో కలుగజేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగబాబు జబర్దస్త్ లాంటి షోను వదిలేసి సింహాసనంపై ఎవరు కూర్చొబెట్టారో వారినే కాటేశాడని విమర్శలు చేశారు.
నాగబాబు లాంటి వాళ్లను చూసే వినాశకాలే విపరీత బుద్ధి లాంటి సామెతలు వచ్చాయని అన్నారు.
చిరంజీవి చార్టెడ్ ఫ్లైట్ ల ద్వారా ఏపీ సీఎం జగన్ ను కలుస్తూ ఉంటారని ఎస్పీ బాలు లాంటి ప్రముఖ సంగీత దర్శకుడు చనిపోతే చూడటానికి మాత్రం చిరంజీవికి సమయం దొరకదని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా నాగబాబు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెబుతూ ఉంటారని అన్నారు.
నాగబాబు వల్ల చిన్నచిన్న కమెడియన్లు బలేపోతున్నారని శ్రీరెడ్డి చెప్పారు.బొమ్మ అదిరింది షో వల్ల శ్రీముఖిపై ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరుగుతోందని శ్రీరెడ్డి కామెంట్ చేశారు. శ్రీముఖికి బుద్ధి ఉందా.? అంటూ శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.శ్రీరెడ్డి బొమ్మ అదిరింది వివాదంపై స్పందిస్తూ మెగా బ్రదర్స్ పై విమర్శలు చేయడంతో మెగా ఫ్యాన్స్ శ్రీరెడ్డిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.