ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య పేరుతో మొత్తం సినీ పరిశ్రమనే షేక్ చేసింది శ్రీ రెడ్డి.అంతేగాక ప్రముఖ సినీ నిర్మాత సురేష్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు నిర్మాత సురేష్ కొడుకు అభిరామ్ తనని ప్రేమించి, నమ్మించి మోసం చేశాడని అప్పట్లో పెద్ద రచ్చ చేసింది ఈ అమ్మడు.
అంతేగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది.దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ గూటికి చేరింది.
అయితే ఇది ఇలా ఉండగా తాజాగా అప్పట్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు ఆతిథ్యం వహించినటువంటి రామానాయుడు స్టూడియోస్ తొందర్లోనే మూత పడుతుందని పలు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై శ్రీరెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ద్వారా స్పందించింది.
ఇందులో భాగంగా నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో తన ఫస్ట్ నైట్ జరిగినటువంటి రామానాయుడు స్టూడియోస్ తొందర్లోనే మూత పడుతుందని క్యాప్షన్ పెట్టింది.
అయితే ఎప్పుడూ ఎవరో ఒకరి పై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేటువంటి శ్రీరెడ్డి ఈమధ్య కొంతమేర సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాక ప్రస్తుతం ఈ అమ్మడు తన దృష్టి డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ పై పెట్టినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు మరియు వంటల సంబంధిత వీడియోలు పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.