శ్రీరెడ్డి పిచ్చి పీక్స్కు చేరినట్లుగా ఉంది.నిన్న మొన్నటి వరకు అభిరామ్, నానిల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ అమ్మడు తాజాగా ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుపై సంచలన ఆరోపణలు చేసింది.
శ్రీరెడ్డి తన అఫిషియల్ ఫేస్ బుక్లో నాని మరియు రామానాయుడు గురించి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది.మొదట నాని గురించి స్పందిస్తూ… అయోమయం ఊర్లో ఉండే నానిగా ఇంట్లో పిల్లోడు ఉన్నాడు ఇప్పటికి అయినా సిగరెట్లు ఆపేశావా లేదా.
నీకు పుడితే ఒకటి, నాకు పుడితే ఒకటా, బాగా పెంచు వాడిని అంటూ పోస్ట్ చేసింది.
ఇక మరో పోస్ట్లో.మా ఊర్లో రామానాయుడు అనే తాతగారు ఉండేవారు.ఆయనకు బాగా అమ్మాయిల పిచ్చి, క్యాన్సర్ వచ్చి చికిత్స చేసుకున్న తర్వాత కూడా ఆయనకు ఆ పిచ్చి పోలేదు.
ఆయన ఎంత మంది పుష్పాలను అనుభవించాడో లెక్కే లేదు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.రామానాయుడు ముసలోడు అయిన తర్వాత కూడా ఫొటో స్టూడియోకు జంటలను పిలిపించుకుని మరీ చూసి నయనానందం పొందే వాడు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇలా ఆ ఫ్యామిలీ పై శ్రీరెడ్డి రోజు రోజుకు చేస్తున్న విమర్శలతో ఆమెపై జనాల్లో అసహ్యం కలుగుతోంది.ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డైరెక్ట్గా రామానాయుడు అంటూ పేరు పెట్టి సంభోదిస్తూ వ్యాఖ్యలు చేయడం వంటి పనులు చేస్తున్న నేపథ్యంలో సినీ వర్గాల వారు కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు.ప్రస్తుతం శ్రీరెడ్డి మరెన్ని కామెంట్స్ చేస్తుందో అని అంతా కూడా టెన్షన్గా ఉన్నారు.