టాలీవుడ్ను వణికిస్తున్న శ్రీరెడ్డి మరోసారి దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసింది.కొన్ని రోజుల క్రితం దగ్గుబాటి అభిరామ్ తనను ప్రేమించాడని, ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నాడు అంటూ సంచలన ప్రకటన చేయడంతో పాటు, అతడి ఫొటోలను కూడా లీక్ చేసింది.
ఆ వ్యక్తి తనకు సినిమాల్లో ఛాన్స్లు ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చి చివరకు తనను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.శ్రీరెడ్డి, అభిరామ్ల మద్య లిప్లాక్ సీన్స్ పెద్ద సంచలనం సృష్టించాయి.
తాజాగా మరోసారి శ్రీరెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేయడంతో టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అభిరామ్ తో తాను ముద్దు పెట్టుకున్న ఫొటోలతో పాటు గతంలో రానా, త్రిషల ముద్దు ఫొటోను కూడా షేర్ చేసింది.అన్నదమ్ములు ఇద్దరు కూడా మాంచి రొమాంటిక్ అన్నట్లుగా శ్రీరెడ్డి కామెంట్ చేసింది.సురేష్ బాబు గారు ఆయన కొడుకులను అమ్మాయిల మీదకు వదిలాడు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు తల దించుకునే పరిస్థితి వచ్చింది.
మరీ ఇంత నీచమైన ఫ్యామిలీ అంటూ శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారంను రేపుతున్నాయి.
శ్రీరెడ్డి వ్యాఖ్యలతో మరోసారి టాలీవుడ్ లో ఆమెకు సంబంధించిన చర్చ మొదలైంది.తమిళనాడుకు వెళ్లి పోయిన శ్రీరెడ్డి అక్కడ సినిమాలు చేసుకుంటూ ఈ విషయాలను పట్టించుకోదని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఈ అమ్మడు మరోసారి టాలీవుడ్ స్టార్స్పై రెచ్చి పోయి వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్న కారణంగా టాలీవుడ్ వర్గాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.
మొన్నటికి మొన్న నాని మరియు నాగబాబులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసింది.