టాలీవుడ్ లో కాంట్రవర్సీయల్ క్వీన్ గా శ్రీరెడ్డి తనదైన ముద్ర వేసింది.సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎవరో ఒకరి మీద కామెంట్స్ చేస్తూ, బూతులు మాట్లాడుతూ అందరి ఇంటెన్సన్ తన మీద పడేలా ప్లాన్ చేసుకుంటుంది.
ఇక లాక్ డౌన్ సమయంలో కూడా శ్రీరెడ్డి తన పంథా మార్చుకోలేదు.ఓ వైపు యుట్యూబ్ చానల్ పెట్టుకొని వంటలక్కగా మారిపోయిన శ్రీరెడ్డి టాలీవుడ్ సెలబ్రిటీల మీద అదే పనిగా నోరు పారేసుకుంటుంది.
తాజాగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ అయిన త్రిష, సమంత మీద చెప్పలేని స్థాయిలో వాఖ్యలతో పోస్టులు చేసింది.వీటి మీద నెటిజన్లు నుంచి ఆమెకి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్న కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా కామెంట్లు చేస్తూనే ఉంది.
తన యద సంపదతో పోల్చుకుంటే త్రిష, సమంత నా ముందు ఎందుకు పనికి రారు అని పోస్ట్ పెట్టింది.దీనిపై సమంత అభిమానులు శ్రీరెడ్డి మీద ఘరం ఘరం అవుతున్నారు.
ఈ మధ్య ఇంట్లో ఖాళీగా ఉంటూ ఎవరు పట్టించుకోవడం లేదని ఏవో ఒక కామెంట్లు పెట్టడం శ్రీరెడ్డికి భాగా అలవాటైపోయింది అంటూ నెటిజన్లు డైరెక్ట్ గా ఆమెకి కౌంటర్లు వేస్తున్నారు.కొందరైతే మరింత శృతి మించి ఆమె ఎలాంటి పోస్టులు పెడుతుందో అంతకంటే దారుణమైన పదజాలంతో విమర్శలు చేస్తున్నారు.
అయిన కూడా శ్రీ రెడ్డి పద్ధతి ఏ మాత్రం మార్చుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.త్రిష, సమంత ఎలా ఉన్న టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్స్, నువ్వు దేనికి పనికి రాకుండా పోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వి అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు.