ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ప్రముఖ నటి శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నేతలు మరియు సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.కాగా ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ అమ్మడిని కొంత కాలం పాటు టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణ విధించింది.
దీంతో అప్పటి నుంచి మెగా హీరోలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.కాగా ఇటీవల కాలంలో వైసిపి పార్టీతో విభేదాలు రావడంతో నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కొంతమేర పార్టీకి దూరంగా ఉంటున్నారు.
దీనికితోడు అప్పుడప్పుడు పలు ఛానెళ్లలో లైవ్ కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.దీంతో శ్రీరెడ్డి రఘు రామ కృష్ణం రాజు ని టార్గెట్ చేస్తూ తన అధికారిక ఫేస్బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.
తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఎంపీ రఘు రామ కృష్ణంరాజుపై ఓ పోస్ట్ ని షేర్ చేసింది.దీంతో కొందరు అభిమానులు వచ్చే ఎలక్షన్లలో నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీంతో శ్రీ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ తాను చాలా పేద అమ్మాయినని తనకి రాజకీయాల్లోకి వచ్చేంత స్థోమత లేదని అలాగే తనకి దేవుడుని చూసే భాగ్యం కలిగింది.అంతే చాలని దేవుడు పక్కనే ఉండాలనే ఆశ లేదని రిప్లై ఇచ్చింది.
దీంతో కొందరు శ్రీ రెడ్డి నెగిటివ్ అభిమానులు నీకు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెలకి ఎంత పంపిస్తున్నాడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే శ్రీరెడ్డి మాత్రం తాను ఇదంతా డబ్బుకోసం చేయడం లేదని కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పై ఉన్నటువంటి అభిమానంతోనే చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది.
అయితే ఇటీవలే మరోమారు మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడని కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం నాటు కోడి అని సంచలన వ్యాఖ్యలు చేసింది అలాగే నెల్లూరు కృష్ణ పట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికైనా వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అందరూ ధన్యవాదాలు తెలియజేయాలని సూచించింది.