ఒకప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు మరియు తెలుగు యువతులకు సినిమా అవకాశాలు ఇవ్వాలంటూ “కాస్టింగ్ కౌచ్” ఉద్యమానికి తెరలేపి నానా హంగామా చేసినటువంటి ప్రముఖ నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా నటి శ్రీ రెడ్డి ఆ మధ్య తెలుగు ప్రముఖ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ అమ్మడిని టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరించింది.
అయినప్పటికీ ఇటీవలే తెలుగు హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రలో నటించిన “క్లైమాక్స్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మళ్లీ తెలుగులో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.
అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసేటువంటి శ్రీ రెడ్డి తాజాగా తెలుగు ప్రముఖ హీరో ప్రిన్స్ “మహేష్ బాబు” పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో భాగంగా ఇటీవలే “సైమా అవార్డ్స్” వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ వేడుకలకు ప్రిన్స్ మహేష్ బాబు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ క్రమంలో నిర్వహించిన ఫోటో షూట్ ఫోటోలను మహేష్ బాబు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.దీంతో శ్రీ రెడ్డి ఈ ఫోటోలో పై స్పందిస్తూ “సిమ్లా ఆపిల్” లాగా ఉన్నాడంటూ కామెంట్లు చేసింది.
దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.మరికొందరు మహేష్ బాబు అభిమానులు అయితే ఈ మధ్య శ్రీరెడ్డి కన్ను మహేష్ బాబు పై పాడిన అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్ది రోజులుగా నటి శ్రీరెడ్డి కి ఆరోగ్యం సరిగాలేదని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.దీంతో ఈ విషయంపై కూడా నటి శ్రీ రెడ్డి స్పందిస్తూ ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగుందని తన అభిమానులు ఆందోళన చెందవద్దని క్లారిటీ ఇచ్చింది.
కాగా ప్రస్తుతం శ్రీ రెడ్డి తన బయోపిక్ ని తెరకెక్కించే పనిలో పడినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.