తెలుగులో ఒకప్పుడు చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని వీటి ఉద్యమానికి తెరలేపి “నానా హంగామా” చేసినటువంటి తెలుగు ప్రముఖ నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే శ్రీ రెడ్డి పోరాటం చేసినటువంటి అంశం మంచిదే అయినప్పటికీ అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లిపై మరియు మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెను టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరించింది.
దీంతో బహిష్కరణకు గురైన అప్పటినుంచి శ్రీ రెడ్డి తమిళనాడులోని చెన్నైలో నివాసముంటోంది అంతేగాక అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో మెగా హీరోలను టార్గెట్ చేస్తూ వారి పై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.
అయితే శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ ఆ వ్యాఖ్యల ఏమిటంటే ప్రముఖ స్వామీజీ నిత్యానందతో కలిసి నటించాలని ఉందని, అలాగే నిత్యానంద స్వామీజీ నవ్వు అంటే తనకు చాలా ఇష్టమని ఓ పోస్ట్ షేర్ చేసింది.అంతేకాకుండా ఈ పోస్ట్ కి నిత్యానంద స్వామిజీ నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోను కూడా జత పరిచింది.
దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతున్నాయి.అయితే గతంలో నిత్యానంద స్వామిజి కి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ కావడంతో నిత్యానంద స్వామితో నటించడమంటే మామూలు విషయం కాదు.
జాగ్రత్త సుమీ. అంటూ శ్రీ రెడ్డికి కొంతమంది నెటిజన్లు జాగ్రత్తలు చెబుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైనప్పటినుంచి శ్రీ రెడ్డి కోలీవుడ్లో పాగా వేసింది.ఈ క్రమంలో పలు వంటలు మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిట్కాల గురించి వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో బాగానే సంపాదిస్తోంది.
ఇటీవలే క్లైమాక్స్ అనే చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ అమ్మడికి అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు.అయితే ఇటీవలే శ్రీ రెడ్డి తన బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.