టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల నగ్నం అనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా టీజర్తోనే అదిరిపోయే క్రేజ్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ, ఈ సినిమా ద్వారా శ్రీ రాపాక అనే హీరోయిన్గా పరిచయం చేశాడు.
పూర్తి బోల్డ్ కంటెంట్ సినిమాగా వచ్చిన ‘నగ్నం’లో ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు మతులు పోయాయి.ఈ సినిమాతో ఆమె క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు.
అయితే శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సమస్యలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించింది.ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నాతో తనకు ఎదురైన పరిస్థితుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.తాను సినిమాల్లో కొత్తగా వచ్చినప్పుడు సుప్రీమ్ సినిమాలో నటిస్తుండగా రాశి ఖన్నా తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసి సెట్స్కు రమ్మని ఆర్డర్ వేసిందట.
రాశికి చీర కట్టేందుకు తనను రావాల్సిందిగా కోరేదట.దీంతో ఆమె సెట్స్కు వెళ్లే సరికి అక్కడ దర్శకుడు ఆమెను తిరిగి చివాట్లు పెట్టేవాడట.
సెట్స్పై చాలా మంది ఆడవారు ఉండగా, ప్రత్యేకంగా శ్రీ రాపాక ఎందుకు వచ్చిందని ఆమెను ప్రశ్నించాడట.అయితే రాశి ఖన్నా తనను ప్రత్యేకించి చీర కోసమే రావాలని పిలిచిందట.
దీంతో ఆమెకు చాలా కోపం వచ్చిందట.రాశి ఖన్నాతో ఇదే విషయంలో మనస్పర్థలు వచ్చాయని శ్రీ రాపాక అంటోంది.
ఏదేమైనా ప్రస్తుతం తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని ఆమె తెలిపింది.నగ్నం చిత్రంలో నటించడం తన కెరీర్కు మంచి బూస్ట్ ఇచ్చిందంటూ ఆమె వెల్లడించింది.