సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమా త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కుతుందని తెలిసిందే.ఈ సినిమాలో పూజా హెగ్దే, శ్రీలీల ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అంతకుముందు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా రీసెంట్ గా ఒక లాంగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు.ఈ షెడ్యూల్ లో ప్రధాన తారగణం అంతా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.
అయితే ఇద్దరు హీరోయిన్స్ లో పూజా హెగ్దే కన్నా శ్రీలీల డామినేషన్ ఎక్కువైనట్టు తెలుస్తుంది.సినిమాలో ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్రే అయినా శ్రీలీల పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని టాక్.
బుట్టబొమ్మ పూజా హెగ్దే పక్కన ఎవరు ఉన్నా వారు అసలు కనిపించరు కానీ అలా కాకుండా శ్రీలీల మాత్రం పూజానే డామినేట్ చేసి షాక్ ఇస్తుందట.పూజా హెగ్దే ఈ విషయంలో కొద్దిగా అసంతృప్తిగా ఉందని టాక్.హారిక హాసిని క్రియేషన్స్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఎస్.ఎస్.ఎం.బి 28వ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా అసలైతే ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా రిలీజ్ జూన్ కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను త్రివిక్రం పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
అది అఫీషియల్ అయితే మహేష్ మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది.