స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ భారత్ క్లీన్ స్వీప్ చేసింది.ఈరోజు జరిగిన మూడో వన్డేలో ఏకంగా 317 పరుగుల తేడాతో విజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో హిస్టరీ క్రియేట్ చేసింది.అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది.391 పరుగుల టార్గెట్ చేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక 73 పరుగులకే అలౌట్ అయింది.వరుసగా 3 వన్డేలను ఇండియా గెలుచుకొని వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
గతంలో ఐర్లాండ్ పై న్యూజిలాండ్ 290 రన్స్ తేడాతో గెలవడం జరిగింది.
ఇప్పుడు దీన్ని ఇండియా అధికమించడం జరిగింది.సిరజ్ 4, షమ్మీ, కుల్దీప్ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీయడం జరిగింది.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 166 పరుగులు చేయడం జరిగింది.భారత్ పెసర్ మహమ్మద్ సీరాజ్ ప్రారంభంలోనే నాలుగు లంక ఓపెనర్ బ్యాట్స్ మెన్ లను పెవిలియన్ కి పంపడంతో… తర్వాత వచ్చిన లంక బ్యాట్స్ మెన్ లు ఎవరు కూడా క్రిజ్ లో నిలదొక్కు కోలేకపోయారు.