దేశం మొత్తం కంటికి కనిపించని కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పోరులో మనోదైర్యం ఉన్న వారు గెలుస్తుండగా, ధైర్యాన్ని కోల్పోయి భయంతో మరణిస్తున్న వారు కూడా ఉన్నారు.
ఎప్పుడైతే ఒక మనిషి మనస్సు బలహీనంగా మారుతుందో అప్పుడే అతను సగం మరణించినట్లు.కాబట్టి కరోనా అనే వైరస్ను మనోధైర్యంతో ఎదుర్కోవడమే ప్రజల ముందు ఉన్న కర్తవ్యం.
ఇకపోతే ఈ కరోనా వల్ల ప్రజల జీవితాలు నాలుగు గోడల వరకే పరిమితం అయ్యాయి.అంతే కాదు పలు దేశాలు కూడా రాకపోకలు నిలిపి వేశాయి.ముఖ్యంగా అనేక దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.తాజాగా పొరుగునే ఉన్న శ్రీలంక కూడా ఆ జాబితాలో చేరింది.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు శ్రీలంకలో దిగేందుకు ఇకపై అనుమతించబోమని శ్రీలంక పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది.కాగా భారత్ లో కరోనా విసృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.