నరరూప రాక్షసులు, కామాంధులు అనే పదానికి ఆ నలుగురు ప్రత్యేక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.తాము కోరుకున్న వారిని చిత్రవద చేసి, అత్యంత దారుణంగా రేప్ చేయడంతో పాటు, వారి వద్ద ఉన్న బంగారం ఇతరు విలువైన వస్తువులను దోచుకోవడం ఈ నలుగురి పని.
ఎవరైనా మొండికేస్తే అత్యంత దారుణంగా చంపడం కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్య.ఇటీవల మరణించిన విద్యార్థిని శ్రీధరణి హత్యకేసులో పోలీసులకు తెలిసిన విషయాలు సభ్య సమాజం నివ్వెర పోయేలా ఉన్నాయి.
ఆ నలుగురు కామాంధులు చెబుతున్న విషయాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒణుకు పుట్టిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…
అంకమ్మరావు, గంగయ్య, సోమయ్య, నాగరాజులు ఒక బ్యాచ్ గా ఏర్పడి కృష్ణ, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంచరిస్తూ ఒంటరిగా ప్రేమ జంటలు కనిపిస్తే టార్గెట్ చేస్తున్నారు.
అబ్బాయిని కొట్టి అతడిని కట్టి పడేసి అమ్మాయిపై అఘాయిత్యంకు పాల్పడుతున్నారు.నలుగురు కూడా ఒకే సమయంలో గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయిలను చిత్రవద చేస్తున్నారు.
ధరణి మరణంతో వీరి వ్యవహారం బయటకు వచ్చింది.ధరణి తరహాలోనే అంతకు ముందు ముగ్గురు చనిపోయారు.
వారి కేసులను కూడా పరిశీలించిన పోలీసులు లోతుగా అద్యయనం చేయగా వీరి గురించిన విషయాలు బయటకు వచ్చాయి.తాజాగా వీరు నలుగురు కూడా పట్టుబడ్డారు.
పోలీసుల విచారణలో వారు అత్యంత దారుణంగా తాము ఎలా అమ్మాయిలను రేప్ చేశామో చెప్పుకొచ్చారు.ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే అబ్బాయిలను చితకొట్టి వారి నుండి డబ్బులు, బంగారం, ఫోన్లు లాక్కుని వారిని కట్టేసి అమ్మాయిలను రేప్ చేస్తాం.అలా ఇప్పటి వరకు 32 మంది అమ్మాయిలను రేప్ చేశాం.మేము రేపు చేసిన వారిలో విజయవాడకు చెందిన ఒక ఎయిడ్స్ పేషంట్ అమ్మాయి కూడా ఉందని వారు నిసిగ్గుగా చెబుతున్నారు.
ఇలాంటి నరరూప రాక్షసులను కేసులు, విచారణ అంటూ సమయం వృదా చేయకుండా వెంటనే ఉరి శిక్ష వేయాలని మహిళ సంఘాల వారు మరియు జనాలు కోరుకుంటున్నారు, మీరు కూడా అందుకు సమ్మతిస్తున్నారా.!
.