తెలుగులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అటువంటి చిత్రం ఆర్.ఆర్.
ఆర్.ఈ చిత్రం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.అయితే తాజాగా ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సరసన ప్రముఖ టాలీవుడ్ అగ్ర కథానాయిక శ్రియా శరణ్ నటించే ఛాన్స్ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ వార్త పై నెట్టింట్లో పలు కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం అజయ్ దేవగన్ సరసన నటిస్తన్నటువంటి శ్రియా శరణ్ స్థానంలో ముందుగా టాలీవుడ్ గ్లామర్ క్వీన్ అనుష్క శెట్టిని సంప్రదించారని, కానీ ఆమె ఇతర సినిమాల తో బిజీ బిజీగా ఉండడం వల్ల ఆమె స్వయంగా శ్రియ శరన్ పేరుని దర్శకుడు జక్కన్నకి రెఫర్ చేశారట.దీంతో జక్కన్న కూడా గతంలో శ్రియ తో చేసినటువంటి చత్రపతి సినిమా దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క శెట్టి నిశ్శబ్దం అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో అనుష్క మూగ చెవిటి సమస్య కలిగి ఉన్న యువతిగా కనిపిస్తోంది.దాదాపుగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు దర్శకుడు హేమంత్ మధుకర్ ఇప్పటికే తెలిపాడు.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ నిర్మించారు.