టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ప్రస్తుతం బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.అదే సమయంలో ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను ఇంటి సభ్యులతో షేర్ చేసుకుంటూ ప్రేక్షకులతో కూడా కంట తడి పెట్టిస్తున్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ గురించి ఇంట్లో ఎక్కువగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న శ్రీశాంత్ తనకు తాను మంచి వాడిని అంటూ చెప్పుకుని, నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సమయంలోనే కొందరు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని బలంగా నమ్ముతున్నారు.
తాజాగా ఒక టాస్క్లో భాగంగా శ్రీశాంత్ మాట్లాడుతూ స్పాట్ ఫిక్సింగ్ సమయంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అసలు నన్ను దోషిగా నిలిపినందుకు ప్రతి ఒక్కరి పట్ల అసభ్య భావం కలిగింది.
ఆ భావనతోనే నేను మళ్లీ ఆత్మహత్యకు ప్రయత్నించాను.కాని ఏ విషయాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొంటే కాలమే మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్మి తాను ముందుకు సాగానని, దేవుడి దయవల్ల కోర్టులో నేను స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడలేదని తేలిపోయిందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం శ్రీశాంత్ మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ వీడియోకు రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని రాజ్ కుంద్రా ఫన్నీ ఈమోజీని పోస్ట్ చేశాడు.రాజ్ కుంద్రా తన ఈమోజీని వెంటనే డిలీట్ చేసినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.శ్రీశాంత్ ఫ్యాన్స్ మరియు క్రీడా వర్గాల వారు రాజ్ కుంద్రా తీరుపై విమర్శలు గుప్పించారు.
ఇక శ్రీశాంత్ భార్య కాస్త సీరియస్గానే రియాక్ట్ అయ్యింది.బెట్టింగ్స్కు పాల్పడుతూ కేసుల పాలయిన వ్యక్తికి శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్ధోశిగా బయటకు వచ్చాడనే విషయం తెలియదా అంటూ ప్రశ్నించింది.
శ్రీశాంత్ గురించి స్పందించే అర్హత ఆ వ్యక్తికి ఉందా అంటూ ప్రశ్నించింది.శ్రీశాంత్ పవిత్రుడు అంటూ కోర్టు నిర్థారించింది.
ఏ ఒక్కరు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.