తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ అభ్యర్థి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోంది.ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలు ఈ ఉద్యమంలో పాల్గొంటూ తమకు ఇష్టమైనటువంటి వారిని ఈ ఉద్యమంలో పాల్గొనాలని చాలెంజ్ విసురుతున్నారు.
అయితే తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో పిల్లలతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొని మొక్కలు నాటాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు.అంతేగాక మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మంచి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రముఖ టాలీవుడ్ విలన్ సోనుసూద్ మరియు హీరో మంచు విష్ణు తదితరులకు విసిరారు.
అయితే ఆ మధ్య కాలంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన “అమర్ అక్బర్ ఆంటోని” అనే చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.దీంతో తన తదుపరి చిత్ర కథల విషయంలో దర్శకుడు శ్రీనువైట్ల కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.