సోనూ సూద్ కి ఛాలెంజ్ విసిరిన టాలీవుడ్ డైరెక్టర్...

తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ అభ్యర్థి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోంది.ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలు ఈ ఉద్యమంలో పాల్గొంటూ తమకు ఇష్టమైనటువంటి వారిని ఈ ఉద్యమంలో పాల్గొనాలని చాలెంజ్ విసురుతున్నారు.

 Sreenu Vaitla, Tollywood Director,  Green India Challenge,  Sono Soud, Villain,-TeluguStop.com

అయితే తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో పిల్లలతో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొని మొక్కలు నాటాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు.అంతేగాక మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మంచి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రముఖ టాలీవుడ్ విలన్ సోనుసూద్ మరియు హీరో మంచు విష్ణు తదితరులకు విసిరారు.

అయితే ఆ మధ్య కాలంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన “అమర్ అక్బర్ ఆంటోని” అనే చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.దీంతో తన తదుపరి చిత్ర కథల విషయంలో దర్శకుడు శ్రీనువైట్ల కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube