బుల్లితెర ఫిమేల్ యాంకర్లలో తక్కువ సమయంలోనే తనకంటే గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి.యాంకర్ రవితో కలిసి శ్రీముఖి చేసిన పటాస్ షో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
అనంతరం బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని శ్రీముఖి రన్నర్ గా నిలిచింది.సీజన్ 3 తరువాత కొంతకాలం టీవీ షోలకు దూరంగా ఉన్న శ్రీముఖి ప్రస్తుతం “ఓ ఉమానియా” అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ “బొమ్మ అదిరింది” షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. అటు బుల్లితెరపైనే కాదు ఇటు వెండితెరపై కూడా అవకాశాలతో శ్రీముఖి టీవీ రంగంతో పాటు సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.జులాయి, నేను శైలజ, జెంటిల్ మేన్, సావిత్రి, బాబు బాగా బిజీ, తదితర సినిమాల్లో శ్రీముఖి నటించారు.
శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఓ ఉమనియా టాక్ షోక్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.తొలి ఎపిసోడ్ కే ప్రముఖ యాంకర్ సుమ రావడంతో టాక్ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ షో నాలుగో ఎపిసోడ్ మహాతల్లి యుట్యూబ్ ఛానల్ ఫేమ్ జాహ్నవి హాజరయ్యారు.ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగానే అకట్టుకుంటోంది.
అయితే ఈ ఎపిసోడ్ కు శ్రీముఖి రెండు రంగులతో కూడిన పొట్టి గౌనులో హాజరయ్యారు.ఆ డ్రస్ గోల్డ్, థిక్ గ్రీన్ కలర్స్ లో ఉంది.
కీర్తన అనే డిజైనర్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో శ్రీముఖి చాలా అందంగా ఉంది.అయితే సుడిగాలి సుధీర్ అభిమానులు మాత్రం శ్రీముఖిని ఈ డ్రెస్ విషయంలో ట్రోల్ చేస్తున్నారు.
గతంలో సుడిగాలి సుధీర్ ఢీ షొకు ఇలాంటి డ్రెస్ లోనే వచ్చాడని శ్రీముఖి సుధీర్ ను కాపీ కొట్టిందంటూ కామెంట్లు పెడుతున్నారు.సరదాగా సుధీర్ అభిమానులు పెడుతున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొందరు నెటిజన్లు సుధీర్, శ్రీముఖి ఒకే క్లాత్ తో కుట్టుంచుకున్నారేమో.? అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.