ఈ మధ్య కాలంలో టీవీ ఛానెళ్లు టీఆర్పీ రేటింగుల కోసం వెరైటీ ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తున్నాయి.గతంలో ఒక ప్రముఖ ఛానల్ రష్మీ, సుధీర్ లకు పెళ్లి అంటూ ఒక ప్రోగ్రామ్ ను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
ఆ ప్రోగ్రామ్ కు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది.దీంతో జీ తెలుగు ఛానల్ కూడా అదే తరహా ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసింది.
అయితే ఈ ప్రోగ్రామ్ కోసం జీ తెలుగు ఊహించని కాంబినేషన్ ను ఎంపిక చేసుకుంది.
బుల్లితెర యాంకర్లలో పెళ్లి కాని యాంకర్లు శ్రీముఖి, ప్రదీప్ లకు పెళ్లి అంటూ దసరా ఈవెంట్ కోసం శుభలేఖలను కూడా కొట్టించారు జీ ఛానల్ నిర్వాహకులు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన యాంకర్ ప్రదీప్ కొన్ని రోజుల క్రితం ప్రముఖ రాజకీయ నేత కూతురును వివాహం చేసుకుంటున్నట్టు వార్తలు వైరల్ అయినా అనంతరం ఆ వార్త నిజం కాదని తేలింది.యాంకర్ శ్రీముఖి రెండు సంవత్సరాల వరకు యాంకర్ గా కొనసాగుతానని.
తరువాత పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.
జీ తెలుగు ఛానల్ ఇప్పటికైతే శుభలేఖను మాత్రమే వైరల్ చేస్తూ “ఈ లెటర్ లో ఏముందో తెలుసుకోవాలని ఉందా.? అయితే చూడండి దసరా ఈవెంట్” అంటూ పబ్లిసిటీ చేస్తోంది.ఈటీవీ కూడా అక్కా ఎవరే అతగాడు.! పేరుతో ఒక ప్రోగ్రామ్ చేస్తుండగా స్టార్ మా ఛానల్ కూడా ఈ తరహా ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసింది.మరి దసరా పండుగ రోజున ఏ ఛానల్ ప్రోగ్రామ్ హైలెట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
జీ తెలుగు ఛానల్ లో ఎన్నో ప్రోగ్రామ్ లకు ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించారు.శ్రీముఖి రెండు వారాల నుంచి ప్రసారమవుతున్న బొమ్మ అదిరింది షో ద్వారా జీ తెలుగు ఛానల్ కు దగ్గరైంది.
మరి ప్రదీప్ శ్రీముఖి మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందనేలా సృష్టిస్తున్న ఈ ప్రోగ్రామ్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో చూడాల్సి ఉంది.