శర్వానంద్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో శ్రీకారం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన కరోనా, జాతిరత్నాలు ఎఫెక్ట్ కారణంగా సినిమా డిజాస్టర్ అయ్యింది.
అయితే కంటెంట్ మీద నమ్మకంతో 14 రీల్స్ ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టారు.అయితే పెట్టిన పెట్టుబడి కూడా సినిమాకి రాలేదు.
థియేటర్ లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఒటీటీలో మాత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.డిజిటల్ ప్రేక్షకులని మెప్పిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో సాఫ్ట్ వేర్ జాబు వదిలేసి సొంతూరు వచ్చేసి ఉమ్మడి వ్యవసాయం చేస్తాడు.రియల్ లైఫ్ స్టొరీని బేస్ చేసుకొని ఈ కథని కిషోర్ తెరపై ఆవిష్కరించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రియాలిటీకోసం అలాగే వ్యవసాయంలో ఉండే కష్టం తెలుసుకోవడం కోసం చిత్ర యూనిట్ నిజంగానే 45 ఎకరాలు సాగు భూమి కౌలుకి తీసుకొని వ్యవసాయం చేసింది.
అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా మొదటిగా వేసిన పంట పోవడంతో మళ్ళీ రెండో పంట వేసి ఆ సాగు భూమిలోనే పొలానికి సంబందించిన సన్నివేశాలు అన్ని షూట్ చేశారు.
రియాలిటీ కోసం ఇలా చేశారు.అయితే ఆ సాగు భూమిని సీనియర్ హీరో నరేష్ దగ్గర నుంచి కౌలుకి తీసుకున్నట్లు తాజాగా ఆయన రివీల్ చేశారు.తనకున్న వ్యవసాయ క్షేత్రంలో 45 ఎకరాలు శ్రీకారం షూటింగ్ కోసం నిజంగానే కౌలుకి తీసుకొని వ్యవసాయం చేశారని చెప్పుకొచ్చాడు.అలాంటి మంచి సినిమాలో తాను కూడా భాగం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.