బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ.వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన సింహ లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇకపోతే ఈ సినిమాలో వరదరాజులు అనే విలన్ పాత్రలో నటుడు శ్రీకాంత్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి షాకింగ్ విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ బాలకృష్ణతో కలిసి తాను నటిస్తున్న రెండో సినిమా అని తెలియజేశారు.
శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించగా నేను లక్ష్మణుడి పాత్రలో నటించానని శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు.ఇక తాను పలు సినిమాలలో విలన్ గా నటిస్తున్న సమయంలో బోయపాటి శ్రీను తనకు ఫోన్ చేసి ఇలా చిన్న చిన్న పాత్రలలో నటించకనీ తన కోసం ఒక మంచి పాత్రను సిద్ధం చేస్తున్నానని చెప్పినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.
బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమా షూటింగ్ సమయంలో తనతో మంచి పరిచయం ఏర్పడిందని ఈ క్రమంలోని ఈ విషయాన్ని వెల్లడించినట్లు శ్రీకాంత్ తెలిపారు.ఇక కొద్ది రోజుల తర్వాత బోయపాటి శీను ఫోన్ చేసి బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలో నటించాలని చెప్పినప్పుడు ఆయనతో నటించాలంటే కొద్దిగా కష్టం అని భావించాను.ఈ సినిమాలో వరదరాజుల పాత్ర కోసం తనని తాను ఎంతో మార్చుకున్నానని ఇందులో నా పాత్రని చూస్తే ప్రతి ఒక్కరికి భయం వేస్తుందని శ్రీకాంత్ తెలిపారు.
ఇక ఇందులో ఓ ప్రత్యేకమైన సన్నివేశం కోసం బాలకృష్ణ నేను తొమ్మిది రోజుల పాటు దుమ్ములోనే ఉన్నామని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.ఇక ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.తాజాగా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చూసి తనకు చాలామంది ఫోన్లు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.
ఇదివరకే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సింహా వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.ఈ క్రమంలోనే అఖండ సినిమాలో ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమా రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వాహకులు ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా ద్వారా విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ పూర్తిగా టర్నింగ్ అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.