టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’ గురించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.వెరైటీ టైటిల్తో రాబోతున్న ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు చిత్ర యూనిట్.ఈ ఈవెంట్లో హీరో శ్రీవిష్ణు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
‘రాజ రాజ చోర’ కథ వినగానే ఈ సినిమా తనకు బాగా నచ్చిందని, ఇలాంటి సినిమా ఒక్కటి చేస్తే కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలోని కంటెంట్ యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాను ఇతర ఇండస్ట్రీల వారు ఖచ్చితంగా రీమేక్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
ఏదేమైనా తన సినిమా కాబట్టి హీరో ఈ విధంగా సినిమాపై కాన్ఫిడెంట్గా ఉండటం సహజమే.అయితే ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేస్తారనడం కాస్త విడ్డూరమే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.
అసలు ఈ సినిమాలో ఎలాంటి మ్యాటర్ ఉందో తెలిశాకే కదా ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ను అందరి ముందు చూపించాలని వారు అంటున్నారు.
అయితే ఈ సినిమాలో ఓ చిల్లర దొంగగా శ్రీవిష్ణు పాత్ర ఉంటుందని, ఓ అమ్మాయిని చూసి అతడు ఎలా మారాడని, అతడికి ఎదురైన పరిస్థితులు ఏమిటనేవి ఈ సినిమా కథగా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు చూస్టే ఇట్టే చెప్పేయొచ్చు.
అలాంటిది ఈ సినిమాను వేరే ఇండస్ట్రీ వాళ్లు ఎలా రీమేక్ చేస్తారని శ్రీవిష్ణు చెప్పాడో ఆయనకే తెలియాలని అంటున్నారు సినీ క్రిటిక్స్.ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన హీరోయిన్లుగా మేఘా ఆకాష్, సునైనా నటిస్తున్నారు.
ఆగస్టు 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.