తెలుగు బుల్లి తెర, వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు శ్రావ్య రెడ్డి.ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.
ప్రతి విషయం గురించి ఎప్పుడు స్పందిస్తూ తనదైన శైలిలో విభిన్నమైన రీతిలో పబ్లిసిటీ తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ తాజాగా యూట్యూబ్ ఛానెల్లో రెచ్చి పోయేందుకు సిద్దం అయ్యింది.తన యూట్యూబ్ ఛానెల్లో బాత్ టబ్ ఛాలెంజ్ అంటూ ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
బాత్ టబ్లో ఈమె రకరకాలుగా జలకాలడటం, వాటిని దమ్ముంటే ఇతరులు చేసి చూపించండి అంటూ చెప్పడం.ఇలా ఈ అమ్మడి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు ఈమె చేసింది రెండు వీడియోలే అయినా, అవి చాలా కూల్ వీడియోలు అయినా కూడా యూత్ ఆడియన్స్లో మాత్రం హిట్ను పెంచుతోంది.పెద్ద ఎత్తున ఈమె వీడియోలకు కామెంట్స్ కూడా వస్తున్నాయి.ఇక మొదటి వీడియోలో వంద బీర్ బాటిల్స్ను టబ్లో పోసుకుని దాంట్లో స్నానం చేయడం.మొదటి బీర్ను నెత్తిపై నుండి పోసుకుని ఆ తర్వాత శరీరం అంతా పోసుకుని తెగ హడావుడి చేసింది.
శ్రావ్య రెడ్డి బీర్ టబ్ ఛాలెంజ్కు అనూహ్య రెస్పాన్స్ దక్కింది.దాంతో తాజాగా ఐస్ టబ్ ఛాలెంజ్ పేరుతో మరో వీడియోను విడుదల చేసింది.
ఎవరేం చేసినా కూడా ఫైనల్గా డబ్బుల కోసమే అనేది అందరి మాట.శ్రావ్య రెడ్డి కూడా యూట్యూబ్ డబ్బుల కోసం ఇలా చేస్తుందనుకోవచ్చు.