బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చేసిన చిత్రం ‘సాహో’.దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ చిత్రం షూటింగ్ను చాలా కష్టపడి దర్శకుడు సుజీత్ చేయడం జరిగింది.
ఇటీవలే చిత్రీకరణ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ సందర్బంగా చిత్రంకు సంబంధించిన పలు విషయాలు మీడియా ముందుకు వస్తున్నాయి.
ఇదే సమయంలో సాహో చిత్రంలో నటించినందుకు గాను హీరోయిన్ శ్రద్దా కపూర్ ఎంత తీసుకుంది అనే విషయమై సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది.
బాలీవుడ్లో అప్కమింగ్ హీరోయిన్ అయిన శ్రద్దా కపూర్ ప్రస్తుతం అక్కడ పలు సినిమాలు చేస్తుంది.భారీ పారితోషికంను ఈమె దక్కించుకుంటుంది.సాహో చిత్రం కోసం శ్రద్దా చాలా డేట్లు ఇచ్చింది.
దాంతో పాటు ఏదో రొమాంటిక్ రొటీన్ పాత్ర కాకుండా లేడీ సూపర్ స్టార్ అన్నట్లుగా ఆమె పాత్ర ఉంది.ఈ చిత్రం కోసం శ్రధ్దా యాక్షన్ సన్నివేశాల కోసం గాను చాలానే కష్టపడ్డట్లుగా ఆమె లుక్ మరియు వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది.
అందుకే ఈ చిత్రంకు శ్రద్దాకు చాలా ఎక్కువగానే ముట్ట జెప్పి ఉంటారని అంటున్నారు.
సాహో చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కింది.దాదాపు 300 కోట్ల బడ్జెట్ కనుక హీరోయిన్కు అటు ఇటుగా 10 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి ఉండవచ్చు అంటున్నారు.ఈ మొత్తంలోనే జీఎస్టీ మరియు స్టాఫ్ ఖర్చు కూడా ఉంటుంది.
అంటే ఆమెకు అటు ఇటుగా రెండు కోట్లు పోను 8 కోట్ల వరకు ఆమెకు చేరుతుందని అంటున్నారు.ఒక సౌత్ మూవీ హీరోయిన్కు ఈ స్థాయిలో ఇవ్వడం ఎక్కువే.
శ్రద్దా కపూర్ పడ్డ కష్టంకు ఇది సరైనదే అంటూ కొందరు అంటున్నారు.సినిమా విడులైతే అప్పుడు ఇది ఎంత వరకు కరెక్ట్ అని తెలుస్తుంది.