విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల సంక్షేమం కోసం చివరి క్షణం వరకు ప్రతిఒక్కరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఇలా సినిమా రాజకీయ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ను తన తల్లిని గేట్ బయట నుంచి పంపించారు
అయితే ఎన్టీఆర్ అలా ఎందుకు పంపించారనే విషయానికి వస్తే ఎన్టీఆర్ కొడుకు అయినా హరికృష్ణకు ఇద్దరు భార్యలనే విషయం మనకు తెలిసిందే.వారిలో ఒకరు లక్ష్మి మరొకరు షాలిని.
లక్ష్మికి జానకిరామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని సంతానం కాగా, షాలినికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సంతానం.అయితే షాలిని రెండవ వివాహం చేసుకొని ఎన్టీఆర్ జన్మించిన తర్వాత హరికృష్ణ తనరెండవ భార్య షాలిని, జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొని ఎన్టీఆర్ ఇంట్లో జరిగే ఒక వేడుకకు వచ్చారు.
అదే సమయంలో గేటు దగ్గర అతిథులు అందరినీ ఆహ్వానిస్తున్న ఎన్టీఆర్ వీరు రావడం చూసిఇంట్లో జరిగే శుభకార్యానికి ఎవరిని పడితే వారిని తీసుకు రాకూడదు అంటూ అవమానించారని ఆ సమయంలో హరికృష్ణ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని తిరిగి ఇంటిదగ్గర వచ్చారట.ఆ విధంగా అప్పట్లో ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య జూనియర్ ఎన్టీఆర్ ని తన కుటుంబ సభ్యులుగా భావించలేదు అయితే ప్రస్తుతం నందమూరి తారకరామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.