సాధారణంగా సినిమా రంగం అన్న తర్వాత ఎప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ఎంత పెద్ద ఫైట్స్ సన్నివేశాలు చేసినా కూడా అటు హీరోలకు చిన్న గీటు కూడా పడకుండా డూపులను పెట్టి డైరెక్టర్లు మానేజ్ చేస్తూ ఉంటారు.
అయితే కొంతమంది హీరోలు మాత్రమే కొన్ని రిస్కీ స్టంట్స్ కూడా చేసి చివరికి గాయాల బారిన పడటం లాంటివి చేస్తూ ఉంటారు.మరి కొన్నిసార్లు తెలియకుండానే పొరపాట్లు జరిగి చివరికి హీరోలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే.
ఇక్కడ నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయం చేసిన ఒక సినిమా విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట.
ప్రొడక్షన్ మేనేజర్ నిర్లక్ష్యం కారణంగా నందమూరి తారక రామారావుకు ఎంతో ఇబ్బంది ఏర్పడిందట.
నందమూరి తారక రామారావు ద్విపత్రాభినయం చేసి ఉర్రూతలూగించిన సినిమా యుగేందర్. ఇక ఈ సినిమాలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మద్యం దుకాణంలోకి వెళ్ళిపోతాడు హీరో.
అ సమయంలో ఒక కిల్లి వేసుకుని సరదాగా పాట పాడే సన్నివేశం ఉంటుంది.అయితే ఈ పాట సమయంలో అన్నగారు ఒకదానిమీద ఒకటి కిల్లి వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ప్రొడక్షన్ మేనేజర్ అన్నగారు వేసుకునేందుకు కిల్లిలను తెప్పించారు.
ఇక్కడే అసలు పొరపాటు జరిగింది.స్వీట్ కిల్లలు తెప్పించాల్సింది పోయి ఖరా కిల్లలు తీసుకొచ్చారు.దీంతో అన్నగారు షూటింగ్ సమయంలో ఒక కిల్లి తర్వాత మరో కిళ్లి వేసుకున్నారు.
అయితే కిల్లి వెంటనే పండాలి అని చెప్పడంతో కిళ్ళి కొట్టు వాడు సున్నం గట్టిగానే పోశాడు.ఈ ఘటన కారణంగా చివరికి అన్నగారి నోరు మొత్తం పొక్కిపోయింది.
ఇష్టమైన ఆహారం తిన్న కూడా రుచి తెలిసేది కాదట.తద్వారా రెండు రోజులపాటు పళ్ళ రసాలతోనే సరిపెట్టుకున్నారు ఆయన.ఇంత జరిగినా అన్నగారు మాత్రం ఎవరిపై కోప్పడలేదట.అంతేకాదు కారా కిల్లి వేసుకోవడం కారణంగానే సీను బాగా పండింది అంటూ చమత్కరించారట నందమూరి తారకరామారావు.
.