తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినీ ప్రముఖులు మరణిస్తూ ఉండడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు సినీ ప్రముఖులు మరణించడంతో సినీ ప్రముఖులు షాక్ లో ఉన్నారు.
ఇక ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం మృతి చెందారనే వార్త నుంచి బయటపడక ముందే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రాజావారు రాణిగారి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు అబ్బవరం కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మొదటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఎస్ ఆర్ కళ్యాణమండపం ద్వారా మరోసారి సందడి చేశారు.అయితే నటుడు అబ్బవరం కిరణ్ ఇంట విషాదం చోటుచేసుకుంది.
నటుడు కిరణ్ సోదరుడు రామాంజుల రెడ్డి బుధవారం ఉదయం కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఇలా కిరణ్ సోదరుడు మృతి చెందిన వార్త తెలియడంతో ఆయన ఇంట విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.