కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి వరుసగా సినిమాలు వస్తున్నాయి.గత శుక్రవారం నాడు ఇష్క్ మరియు తిమ్మరుసు సినిమాలు వచ్చాయి.
ఇక ఈ వారం కూడా పలు సినిమాలు రాబోతున్నాయి.అందులో ప్రధానంగా ఎస్ ఆర్ కళ్యాణ మండపం ఒకటి.
ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ అంతా నమ్మకం తో ఎదురు చూస్తున్నారు.
ఇది మరో జాతిరత్నాలు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ముగ్గురు స్నేహితుల మద్య సాగే వినోదాత్మక కథ తో ఈ సినిమా సాగుతోంది.
ఎంటర్ టైన్ తో పాటు ఒక ఎమోషనల్ స్టోరీ లైన్ కూడా ఉంటుందని అంటున్నారు.మొత్తానికి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి చర్చించుకుంటున్నారు.
ఈ సమయం లో సినిమా ప్రమోషన్ ను మరింతగా చేసేందుకు యూనిట్ సభ్యులు సిద్దం అయ్యారు.హీరో కిరణ్ మరియు యూనిట్ సభ్యులు మెట్రో ట్రైన్ లో సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్లారు.నలుగురు స్నేహితుల మద్య జరిగే ఈ స్టోరీ అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.సినిమా ప్రమోషన్ సమయం లో యాక్టివ్ గా యూనిట్ సభ్యులు పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు.
సినిమాకు సంబంధించినంత వరకు అన్ని విధాల ఎమోషన్స్ ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ టైన్ అయ్యే విధంగా ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి.ప్రస్తుతం ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సోషల్ మీడియా లో కూడా జోరుగా వస్తున్నాయి.